సింగపూర్ లో 4800 మంది ఇండియన్స్ కు కరోనా

సింగపూర్ : సింగపూర్ లో ఉన్న ఇండియన్స్ లో 4800 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 90 శాతం మంది ఉపాధి కోసం వెళ్లిన లేబర్సే ఉన్నారు. ఐతే వీరికి కరోనా తీవ్రత చాలా స్వల్పంగా ఉందని..ఎవరికి ప్రమాదం లేదని సింగపూర్ లోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం వీరందరూ విదేశీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఉన్నారు. ” కరోనా సోకిన ఇండియన్స్ అంతా క్షేమంగానే ఉన్నారు. వాళ్లలో తీవ్రత స్వల్పంగానే ఉంది. క్రమంగా కోలుకుంటున్నారు ” అని సింగపూర్ లోని భారత హైకమిషనర్ జావేద్ అష్రాఫ్ చెప్పారు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫుడ్ తో పాటు ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నామని మానసికంగా ఆందోళన చెందకుండా ఇద్దరు కౌన్సిలర్లను నియమించామన్నారు. సింగపూర్ లో చిక్కుకుపోయిన దాదాపు 3500 మంది వసతి, ఆహారం కోసం హై కమిషనల్ లో నమోదు చేసుకున్నట్లు చెప్పారు. కేంద్రం విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చి ప్రక్రియ ప్రారంభించగానే భారత్ కు తిరిగి వెళ్లే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.