పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పెళ్లి, ఇతర శుభకార్యాలకు 50 మందికి మించి, అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి నిరాకరించింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటిస్తూ.. ఐదుగురికి కంటే మించి ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, మద్యం సేవించడం, పాన్‌, గుట్కా, పొగాకు నమలడం నిషేధించారు.