50 మందికి అల్పాహారం పంపిణి

కావలి,(ఆరోగ్యజ్యోతి): పట్టణంలో వరవకట్ట కాలువ పై నివాసముంటున్న గిరిజనులు కు ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ చేవూరు చిన్న ఆధ్వర్యంలో   50 మందికి అల్పాహారం ఇవ్వటం జరిగింది ఈ సందర్బంగా మాజీ కౌన్సిలర్ షాహూల్ మాట్లాడుతూ గత 30 సంవత్సరం నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి సదుపాయాలు లేక కనీసం ఆధార్ కార్డ్ కూడ లేకుండా  వరవకట్ట కాల్వపై పనిచేసుకొని జీవిస్తూన్న గిరిజనులకు డాక్టర్ చేవూరు చిన్న వారి ఆర్గనైజేషన్ ద్వారా ప్రతిరోజు ఆహారం అందించటం అభినందద గా విషయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో  ఎలక్ట్రికల్ సౌండ్ సిస్టమ్ ప్రోప్రయటర్  షకీల్, ఆర్గనైజీషన్ సభ్యులు విక్లిఫ్, శివ, అభిషేక్ పాల్గొన్నారు.