కావలి(ఆరోగ్యజ్యోతి): కావలి పట్టణంలోని గిరిజనులుకు ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ చేవూరు చిన్న ఆద్వర్యంలో 50 మందికి అన్నదానం చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి సోకకుండా అందరూ జాగ్రత్త వహించాలి పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా జీవించాలని, మాస్కులు ధరించాలని ఆయన కోరారు. పై కార్యక్రమములో వైబ్రాంట్స్ ఆఫ్ కలాం టౌన్ ఇంచార్జి చేవూరు కిరణ్ కుమార్, సంస్థ సభ్యులు విక్లిఫ్, యాసిన్, శివ, అభిషేక్ పాల్గొన్నారు.