రాష్ట్రంలో ఈ రోజు మరో 51 ‘కరోనా’ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 37 గ్రేటర్ పరిధిలోనే నమోదు కాగా మరో 14 వలస వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికి చికిత్స పొంది డిశ్చార్జి అయిన వారి సంఖ్య 822 గా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుని డిశ్చార్జిఅయిన వారు మొత్తం 21 మంది. ఇప్పటికి తెలంగాణలో కరోనా భారిన పడిన వారి సంఖ్య 1326 కు చేరింది.