కరోనాకు ఇస్తున్న వైద్యం సత్ఫలితాలు ఇస్తోంది- డా. కొండల్‌రెడ్డి

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) ‌:  రాష్ట్రంలో కరోనా వ్యాధి గ్రస్తులకు ఇస్తున్న వైద్యం సత్ఫలితాలను ఇస్తోందని ఉస్మానియా హాస్పిటల్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కొండల్‌రెడ్డి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో కరోనా వ్యాధికి చికిత్సలు జరుగుతున్నాయన్నారు. పూర్తిస్థాయిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మాధెరపీ కూడా ప్రారంభమైందన్నారు. కరోనా వైరస్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార, పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పలువురు వైద్యనిపుణులు మాట్లాడారు. ఈసందర్భంగా డాక్టర్‌ కొండల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఆస్పత్రులలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌లను ధరించడం తప్పని సరి అన్నారు. చేతులను విధిగా 40 సెకన్లపాటు కడుక్కోవడం అలవర్చుకోవాలన్నారు.