న్యూఢిల్లీ(ఆరోగ్యజ్యోతి): అమెరికా, స్పెయిన్, ఇటలీ తదితర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా కేసుల సంఖ్య 100 నుంచి లక్షకు చేరుకోవడానికి 64 రోజులు పట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆరోగ్యశాఖ, వరల్డో మీటర్స్ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా కేసులు కేవలం 25 రోజుల్లో 100 నుంచి లక్షకు చేరాయి. ఇక భారత్లో ప్రతి లక్ష మంది జనాభాకు సగటున 7.1 కరోనా కేసులు రికార్డయితే, ప్రపంచ వ్యాప్తంగా అది 60 కేసులుగా ఉంది. భారత్లో ప్రతి లక్ష మందికి 0.2 మంది మరణిస్తుండగా, అది ప్రపంచ వ్యాప్తంగా 4.1గా ఉంది. వైరస్ పురుడు పోసుకున్న చైనాలో (0.3) కంటే భారత్లో మృతుల రేటు తక్కువ. స్పెయిన్లో అత్యధికంగా ప్రతి లక్ష మందికి 59.2 మృతుల రేటు ఉండగా, ఇటలీలో 52.8, బ్రిటన్లో 52.1, ఫ్రాన్స్లో 41.9, అమెరికాలో 26.6గా నమోదైంది