- గత సంవత్సరం రాష్ట్రంలో 13,361 డెంగీ కేసులు
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోనా విజృంభనతో వణుకుతున్న హైదరాబాద్కు మరో ముప్పు పొంచి ఉంది. ఇంకో నెలలో రాబోతున్న వర్షాకాలం మరిన్ని ప్రమాదాలను మోసుకురానుంది. సాధారణంగా వర్షాకాలంలో దోమ కాటు వ్యాధులు ప్రబలుతుంటాయి. గత సంవత్సరం వర్షాకాలంలో గత సంవత్సరం రాష్ట్రంలో 13,361 డెంగీ కేసులు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో మాన్సూన్ ముప్పు మరోసారి ముంచుకొస్తోంది.కొనసాగుతున్న కరోనా ఉధృతికి ఈ మాన్సూన్ ముప్పు కూడా తోడైతే.. ఈ ఆలోచనే అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మురికి కాలువలు, కుంటలు దోమలకు ప్రధాన ఆవాసాలు. చెరువుల్లో గుర్రపు డెక్కను ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ తొలగిస్తున్నా.. అది తిరిగి పుట్టుకొస్తోంది. నాలాలు, ఓపెన్ డ్రైన్లు ఉన్న ప్రాంతాల్లో అయితే.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దోమకాటు ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ, చికెన్గున్యా, జపనీస్ ఎన్కెఫలైటీస్ లక్షణాలు కూడా కరోనా లక్షణాలతో సరిపోలుతున్నందున ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి జ్వరం కేసునూ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ సీజనల్ వ్యాధులకు చేసే పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు కూడా చేయాలి. గత సంవత్సరం రాష్ట్రంలో 13,361 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.