హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో లాక్డౌన్తో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నారని.. ఇంటి అద్దె ప్రభుత్వమే భరించాలంటూ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1500కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నా... పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మూడు నెలల పాటు అద్దె మినహాయించినా... తర్వాత కట్టాల్సిందే కదా?అన్నారు. రూ.15వేల లోపు అద్దె ఉన్న వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కరోనా కాలంలో ఇంటి కరెంట్ బిల్లులు మాఫీ చేయాలన్నారు. వలస కార్మికులను ఆదుకునేందుకు... స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకొస్తున్నాయని ప్రశంసించారు. ఇంటి పన్నులను కూడా ప్రభుత్వం మాఫీ చేయాలన్నారు. వర్షాకాలంలో రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలన్నప్రభుత్వాన్ని కోరారు.