81 మంది ఖైదీల‌కు క‌రోనా పాజిటివ్‌

ముంబై: ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలులో 81 మంది ఖైదీల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. ఈ కేసుల‌తో క‌రోనా సోకిన ఖైదీల సంఖ్య 184కు చేరుకుంది. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిలో 26 మంది జైలు సిబ్బంది కూడా ఉన్నారు.జైళ్ల‌లో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశ‌వ్యాప్తంగా జైళ్ల శాఖ అధికారులు విచార‌ణ‌లో ఉన్న ప‌లువురు ఖైదీల ను మ‌ధ్యంత‌ర బెయిల్ పై విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.