తొమ్మిది నెలల గర్భిణి ఎవరైనా ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటారు. కర్ణాటకలోని శివమొగ్గ ప్రభుత్వ దవాఖానలో నర్సుగా పని చేస్తున్న రూపా ప్రవీణ్ రావు అలా చేయలేదు. కరోనా పంజా విసురుతున్న ఈ కష్టకాలంలో కూడా సమీప గ్రామాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవల్ని అందజేస్తున్నారు. తొమ్మిది నెలల గర్భిణి అయుండి.. రోజూ కనీసం ఆరు గంటలపాటు దవాఖాన విధుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం యెడియురప్పా ఆమెకు ఫోన్ చేసి ప్రశంసించారు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.