ముంబై,(ఆరోగ్యజ్యోతి):ఆసియాలోనే అతిపెద్ద మురికవాడ ధారావిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం ఊహించని రీతిలో ధారావిలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే 94 కరోనా పాజిటివ్ కేసులు ధారావిలో నమోదవడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి నెలకొంది. ధారావిలో కొత్తగా ఇద్దరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో.. ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 590కి చేరింది. మరణాల సంఖ్య 20కి చేరింది.శనివారం కూడా ధారావిలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. శనివారం 89 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1న ధారావిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవడం గమనార్హం.