ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోజర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ

పాల్గొన్న అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు...



 కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): దూరం పాటించాలని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు . నిత్యం వార్తల సేకరణకై రాత్రి పగలనక శ్రమిస్తున్న జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుత పరిస్థితిలో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ సమయంలో తమ వంతు కర్తవ్యంగా కొత్తగూడానికి చెందిన జీవి మాల్ నిర్వాహకులు ఉమ, నరేందర్ మరియు ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఇమంది ఉదయ్ కుమార్ కృష్ణవేణి దంపతులు ముందుకు వచ్చి బియ్యం నిత్యావసరాలు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. చాలామందికి సాయం చేయాలని ఉన్నా  గొప్ప మనసు ఉండదని, ఇటువంటి ఆపత్కాలంలో అందరూ ఒకరికొకరు సాయపడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జర్నలిస్టులకు  బియ్యం నిత్యావసరాలు, కూరగాయలు, మాస్కులు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీనివాస్, కొత్తగూడెం ప్రెస్ క్లబ్ కమిటీ కన్వీనర్ జునమాల రమేష్, కో కన్వీనర్లు రాజు షఫీ గౌరవ సలహాదారులు ఇమంది ఉదయ్ కుమార్ , ఎర్ర ఈశ్వర్ , వట్టి కొండ రవి, ఇర్ఫాన్ ,కమిటీ సభ్యులు జాన్సన్ బాబు, నరసింహారావు, రాజేష్, పోలిశెట్టి రమేష్ , భాస్కర్ మరియు అన్ని వార్తా పత్రికల రిపోర్టర్లు, ఆపరేటర్లు, యాడ్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు .