హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19పై యుద్ధం చేస్తున్న యోధులు వారు. రోగులకు చికిత్స చేస్తూ.. వారి ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డేస్తున్నారు. నిరంతర పోరాటంలో 24 గంటలు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఘనంగా వందన సమర్పణ చేస్తోంది వాయుసేన. దేశ వ్యాప్తంగా కరోనా ఆస్పత్రులపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ పూలవర్షం కురిపించింది. వైద్య సిబ్బందికి ఎయిర్ఫోర్స్ ఇస్తున్న అపూర్వ గౌరవం ఇది. డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యురిటీ.. ఇలా ఆస్పత్రుల్లోని ప్రతి విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతుంది. విశాఖలో చెస్ట్, గీతం ఆస్పత్రి, హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ బలగాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావంగా సముద్రతీరాల్లో నౌకలు నిలిపిన నేవీ తమ కృతజ్ఞతను చాటుకుంది.