బిల్ గేట్స్ స‌ల‌హాలు కోరిన ప్ర‌ధాని మోదీ..

మైక్రోసాఫ్ట్ ఓన‌ర్ బిల్ గేట్స్‌తో ప్ర‌ధాని మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు.  గురువారం రాత్రి సుమారు అర‌గంట పాటు గేట్స్‌తో మోదీ సంభాషించారు. కోవిడ్‌19పై వారిద్ద‌రూ చ‌ర్చించారు. శాస్త్రీయ ఆవిష్క‌ర‌ణ‌ల్లో ప్ర‌పంచ‌దేశాల పాత్ర‌పై మాట్లాడారు. మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు కావాల్సిన ఆర్ అండ్ డీ గురించి కూడా ఇద్ద‌రూ చ‌ర్చించారు.  క‌రోనాపై పోరాటంలో భార‌త్ అనుస‌రించిన విధానాన్ని గేట్స్‌కు మోదీ వివ‌రించారు. ప్ర‌జల‌ను జాగ్రృతి చేయ‌డంతో క‌లిగిన లాభాల‌ను వెల్ల‌డించారు. భౌతిక దూరం పాటించ‌డం,  వైద్య బృందాల‌ను గౌర‌వించ‌డం, మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం, పారిశుద్ధ్యం పాటించ‌డం లాంటి విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌ను ఆక‌ళింపు చేసుకున్న‌ట్లు మోదీ ఆ వీడియోకాన్ఫ‌రెన్స్‌లో తెలిపారు. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారిని ఎదుర్కోవడానికి గ‌తంలో త‌మ ప్ర‌భుత్వాలు చేపట్టిన అనేక స్కీమ్‌లు ప్ర‌జ‌ల‌కు ఉప‌క‌రించిన‌ట్లు తెలిపారు. స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌తో పారిశుద్ధ్యం పెరిగింద‌న్నారు. ప్ర‌జ‌ల ఇమ్యూనిటీని పెంచేందుకు ఆయుర్వేద విశిష్టాన్ని తెలిపామ‌న్నారు. ఇలాంటి వాటి వ‌ల్ల భార‌త ప్ర‌జ‌లు మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోగ‌లిగార‌ని గేట్స్‌తో  మోదీ తెలిపారు. మ‌హమ్మారి చికిత్స‌లో వ్యాక్సిన్ త‌యారీ గురించి కూడా గేట్స్‌తో చ‌ర్చించారు.