అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిశీలించిన కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

భద్రాద్రి కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పాత కొత్తగూడెం కేంద్రాన్ని ఈరోజు సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ సందర్శించారు, ముఖ్యంగా ఆసుపత్రి ఆవరణ లో పూల మొక్కలను,ఔషధ మొక్కలను,పరిశీలించి మొక్కలకు నీరు పెట్టడం జరిగినది,అనంతరం కరోనా వైరస్ నివారణలో భాగంగా ఆసుపత్రికి బయటనుండి వచ్చే రోగులు చేతులు కడుగుకొనుటకు గాను నూతనంగా ఏర్పాటుచేసిన వాష్ బేషన్ ను పరిశీలించి, జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో రోగుల సౌకర్యార్థం వాష్ బేషన్ లు ఏర్పాటు చేయాలని,వారు తెలిపారు,ఈ యొక్క కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం హెచ్.ఓ,డాక్టర్ పోటు వినోద్ వైద్యాధికారిని నిస్సి షారోన్, సి.హెచ్.ఓ,రామకృష్ణ,హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసు,పి.హెచ్.ఎన్, కుసుమ కుమారి,పబ్లిక్ హెల్త్ మేనేజర్ పొన్నెకంటి సంజీవ రాజు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.