నాగ్ పూర్ : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది రోజుల తరబడి ఇంటికెళ్లకుండా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ పూర్ లోని ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో నర్సుగా సేవలందిస్తున్న రాధికా వించూర్కర్ నెల రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చింది. ఆమెను ఇంటి దగ్గర కాలనీవాసులు ఘనంగా సత్కరించారు.రాధికపై కాలనీవాసులు పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. నర్సుకు హారతి ఇచ్చి కుటుంబసభ్యులు ఇంట్లోకి ఆహ్వానించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తోన్న నర్సును అందరూ ప్రశంసలతో ముంచెత్తారు.