అయ్యవారిపాలెం,(ఆరోగ్యజ్యోతి): కరోణ కారణంగా దాదాపుగా 50 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో కూలి పనులు లేక తినడానికి తిండి లేక అల్లాడుతున్న వరదయ్యపాలెం మండలం అయ్యవారిపాలెం లోని 50 గిరిజన కుటుంబలకు బిఇపిసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి రియాజ్ మాట్లాడుతూ మహమ్మారి రోగాన్ని అదుపు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం విధితమే కూలీనాలీ చేసుకుని బ్రతికే సామాన్య ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం .ఇప్పటి వరకు మండలంలో ఉన్న దాదాపు అన్ని గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ నిరుపేదల ఆకలి తీర్చడాని ప్రయత్నిస్తున్నామని రానున్న రోజుల్లో కూడా పేదలకు సహాయం చేయడానికి దశల వారిగా కార్యాచరణ రూపొందించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముని కృష్ణయ్య, సంస్థ సభ్యులు సుకుమార్, మాచాలయ్య, అరుణ్, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.