పుదుచ్చేరి : పుదుచ్చేరిలో సోమవారం నుంచి పరిశ్రమలు, దుకాణాలు పునర్ ప్రారంభం అయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశ్రమలు, దుకాణాలకు అనుమతిస్తూ పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం నిర్ణయించింది. సామాజిక దైూరం పాటిస్తూ దుకాణాలు, పరిశ్రమలు తెరచుకోవచ్చని, దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సీఎం నారాయణస్వామి చెప్పారు. రెస్టారెంట్లు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటలవరకు తెరచి ఉంచి పార్శిల్ సర్వీసులు అందించేందుకు పుదుచ్చేరి సర్కారు అనుమతించింది. కాగా పుదుచ్చేరిలో మద్యం దుకాణాలను ప్రారంభించే విషయంలో మాత్రం సర్కారు నిర్ణయం తీసుకోలేదు. పుదుచ్చరిలో 8 కరోనా వైరస్ కేసులు నమోదైనాయి.