న్యూఢిల్లీ : ఆగ్రా జిల్లా జైలులో మరో ముగ్గురు ఖైదీలకు కరోనా సోకింది. ఇటీవల 90ఏళ్ల నిందితునికి కరోనా సోకిన అనంతరం ఖైదీలకు పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఆగ్రాలోని సెంట్రల్ జైలులో ఒక వ్యక్తి కరోనాతో మృతిచెందడంతో మరో పదిమందికి కరోనా పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగ్రాలోని సెంట్రల్, జిల్లా జైళ్లు రెండూ ఒకే ప్రాంగణంలో ఉంటాయని, జిల్లా జైలులో ఖైదీలు, విచారణను ఎదుర్కొంటున్న నిందితులు ఉంటారని అధికారులు తెలిపారు. 90 ఏళ్ల నిందితుడిని జైలు ఆస్పత్రికి తరలించామని అన్నారు. ఈ ముగ్గురు ఖైదీలను ప్రత్యేక గదుల్లో ఉంచామని అన్నారు. ఇటీవల ఆగ్రా సెంట్రల్ జైలులో కరోనా సోకిన ఆరుగురు ఖైదీలు, ఇద్దరు జైలు సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే