సూర్యాపేట,(ఆరోగ్యజ్యోతి): కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేవరకూ అప్రమత్తంగా ఉండాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నిబందనలు సడలించడం అంటే కరోనా పోయినట్టుకాదన్నారు. లాక్డౌన్ను రోజువారీ జీవితంలోనూ అలవర్చుకోవాలన్నారు. కరోనా వైరస్ నిరోధానికి ఉపయోగించే మూడువేల లీటర్ల శానిటైజర్తో పాటు మూడువేల మాస్క్లను ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు సోమవారం జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డికి అందించారు. విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ శానిటైజర్ల వినియోగ ంతోపాటు విధింగా మాస్క్లు ధరించాని సూచించారు. విపత్తు సమయంలో దాతృత్వం ఽధైర్యాన్నిఇస్తుందన్నారు. అటువంటి దాతృత్వాన్ని చాటుకున్న నేత నామానాగేశ్వరరావని అన్నారు. కరోనా వైరస్లోనూ దాతల దాతృత్వంలో ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వం పోలేని చోటకు స్వచ్చంద సంస్థలు వెళ్లడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో ప్రజల భాగస్వామ్యం ఉందన్నారు. తీవ్రతను ప్రజలు గుర్తించినందునే కరోనా కట్టడిలో ఉందన్నారు. ఏ ఒక్కరూ పస్తులు ఉండవద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఇతర రాష్ర్టాల వారినీ ఆదుకున్న ఘనత తెలంగాణదేనన్నారు.