బయ్యారం,(ఆరోగ్యజ్యోతి) : ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శివ బ్లెడ్ బాంక్ వారి అద్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండలంలోని యువత, ఉద్యోగస్తులు స్వచ్చందంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు. మండల కేంద్రంలో ఎంపీపీ చేపూరి మౌనిక , వైస్ ఎంపీపీ తాత గణేష్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెంటాల బుచ్చిరెడ్డి ,ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బత్తిని రామ్మూర్తి , కార్యదర్శులు తిరుమల ప్రభాకర్ రెడ్డి , బానోత్ మురళి నాయక్ , ఎంపీటీసీ తిరుమల శైలజ రెడ్డి, సర్పంచ్ కోటమ్మ ,నాయకులు జర్పుల శ్రీను , కొండ్రెడ్డి సోమిరెడ్డి , ఏనుగుల రాకేష్ , బానోతు శ్రీను ఏ ల్లవుల మల్లయ్య , తంగళ్ళపల్లి వీరభద్రం , చాపల వెంకన్న, ఇతర పార్టీ పెద్దలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.