కరోన  నిర్ధారణ పరీక్ష కేంద్రం పరిశీలన

- ఇక నాలుగు జిల్లాల కరోన పరిక్షలు రిమ్స్ లోనే  


ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ అనుమతితో ఆదిలాబాద్ లోని  రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు  కరోన  నిర్ధారణ పరీక్ష కేంద్రం మంజూరు కావడం జరిగింది. కరోన కేంద్రం మంజూరు కావడంతో రిమ్స్ లోని మీ పరీక్ష కేంద్రాన్ని శనివారం నాడు జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న జిల్లా కలెక్టర్ దేవసేన ఆసుపత్రిని పరిశీలించారు.ఈ కేంద్రం లో  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, కొమరంభీమ్, మంచిర్యాల ,ఆదిలాబాద్, ప్రాంతాలను చెందిన వారికి  జిల్లా వైద్యాధికారి నుండి వచ్చినటువంటి నమూనా పరీక్షలను నిర్ధారించడం జరుగుతుంది ద్వారా రోజుకి సుమారు 40 వరకు ద్వారా 30 పరీక్షలను నిర్వహించవచ్చని  వారు తెలిపినారు.సి బి నాట్ యంత్రం ద్వారా కరోనా లక్షణాలతో కూడిన వారికి ప్రైమరీ వ్యక్తులకు, శ్వాసకోశ, సంబంధిత లక్షణాలు కలిగిన వారికి, ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ నీ కాంటాక్ట్ వ్యక్తులకు, రెడ్ జోన్ కాన్ టైన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న గర్భిణీ స్త్రీలకు ప్రసూతి అంచనా  తేదీ కంటే ఐదు రోజుల ముందు వైద్య అధికారుల ద్వారా వచ్చినటువంటి గర్భవతులకు పరీక్షించి నిర్ధారణ జరుపుతారని తెలిపినారు. సి బి నాట్ ద్వారా పరీక్ష చేయడానికి సుమారు ఒక వ్యక్తికి 12 వేల రూపాయల వరకు ఖర్చు కావడం జరుగుతుంది .ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ బలరాం బానోత్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ శోభా పవర్,డిప్యూటీ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ నరేష్ రాథోడ్, డాక్టర్ నరేందర్ బండారి, డాక్టర్ సందీప్ యాదవ్, డాక్టర్ పద్మవల్లి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పిఆర్ఓ) జీ .శారద, మెడికల్, పార మెడికల్, వైద్య సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.