న్యూఢిల్లీ, మే 5: ఐటీ దిగ్గజం విప్రో తన క్యాంప్సను కొవిడ్-19 ఆస్పత్రిగా మార్చేందుకు సిద్ధమైంది. పుణె హింజేవాడిలోని ఐటీ క్యాంప్సను 450పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మే 30లోగా అన్ని సదుపాయాలతో ఆస్పత్రిని ప్రభుత్వానికి విప్రో అందజేయనుం ది. ఐసోలేషన్ సదుపాయం ఉన్న ఈ ఆస్పత్రిలో కరోనా రోగులకు అత్యవసర చికిత్స కోసం 12 పడకలను ఏర్పాటు చేస్తారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది కోసం 24 ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు.