వరదయ్యపాలెం,(ఆరోగ్యజ్యోతి): ఆశా వర్కర్లకు బి ఇ పి సి ఫౌండేషన్ వారు గురువారం నాడు స్థానిక వరదయ్యపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండలం లో ఉన్న ఆశా వర్కర్లకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వేవస్థాపకులు రియాజ్ మాట్లాడుతూ కరోనా ను కట్టడి చేయాలని ఎవరికి తగిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దేశ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా వైద్య శాఖ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల వివరాలు సేకరిస్తూ తమ ప్రాణాలను సైతం పణం గా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు చిన్న సహాయం చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తమ కష్టాలను గుర్తించి ఆశాలకు సహాయం చేసిన బి ఇ పి సి ఫౌండేషన్ వారికి డాక్టర్ చంద్ర మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అరుణ్, మాచల్, హుస్సేన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.