జగిత్యాల,(ఆరోగ్యజ్యోతి): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో స్కావెంజర్లు, పార్ట్ టైం స్వీపర్లు, ఆశ వర్కర్లకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం మండలానికి మంజూరు అయిన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.5,51,580 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. యశ్వత్ రావు పేట గ్రామ శివారులో 5 లక్షల మెట్రిక్స్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి మత్రి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ యశ్వత్ రావు పేట (గంగాపూర్ ) పాడి చెరువు పూడిక పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.