ఆ జోన్లో ఆరు జిల్లాలు.. 21 వేల మంది గర్భిణులు
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో రెడ్జోన్ పరిధిలో ఉన్న గర్భిణులకు తప్పకుండా కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలని, వేరొకచోటకు తరలించకుండా నేరుగా వారి వద్దకే వెళ్లి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపాలని సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటం.. రెడ్జోన్ జిల్లాల్లోని కట్టడి ప్రాం తాలు, వలస వచ్చి గుంపుగా నివసించే ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కాన్పు తేదీకి ఐదు రోజుల ముందు పరీక్షలు చేసి నమూనాలను పంపాలని కోరింది. రాష్ట్రంలో సగటున రోజు కు 1,650 ప్రసవాలు జరుగుతుంటాయి. ఇందులో 55 శాతమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుతుంటాయి. అయితే, కరోనా విజృంభణ తర్వాత ఈ శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఐసీఎంఆర్ తాజా ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ గర్భిణుల వివరాలను ేసకరించింది. ‘కేసీఆర్ కిట్’ ఆధారం గా.. మే నెలలో ఎంతమందికి ప్రసవం కానుందో గణాంకాలను సేకరించారు.దీనిప్రకారం 33 జిల్లాల్లో 50,978 మందికి కాన్పు తేదీ ఇచ్చారు. ఇందులో 6 జిల్లాలు రెడ్ జోన్లో ఉండగా.. ఆ పరిధిలోని 21,127 మందికి కాన్పు తేదీ ఇచ్చారు. వీరిలో బీపీ, షుగర్ సహా ఇతర అనారోగ్య సమస్యలతో హై రిస్క్ లో ఉన్నవారు 3,869 మంది ఉన్నారు. అత్యధికులు (5,544) హైదరాబాద్లో డెలివరీ అయ్యేవారే ఉన్నారు. ఇందులో 425 హై రిస్క్ కేసులున్నాయి.