వరదయ్యపాలెం,(ఆరోగ్యజ్యోతి) : కరోనా కారణంగా దాదాపు 45 రోజుగా లాక్ డౌన్ విధించడంతో జీతాలు లేక తినడానికి తిండి లేక అలాడుతున్న వలస కార్మికులకు వరదయ్యపాలెం బి ఇ పి సి ఫౌండేషన్ అద్వర్యంలో నరేష్ సహకారంతో సుమారు 70 మందికి సోమవారం నాడు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు రియాజ్ మాట్లాడుతూ గత 45 రోజులుగా పేద వారి ఆకలి తీర్చడనికి అనేక కార్యక్రమాలు నిర్వహించాడం జరిగింది. వీటిని ఆదర్శం గా తీసుకొని మిత్రుడు నరేష్ ముందుకు వచ్చి పొట్ట కూటి కోసం మన ప్రాంతానికి వచ్చిన వలస కార్మికుల ఆకలి తీర్చడానికి ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలానే అనేక మంది దాతలు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, మాచల్ తదితరులు పాల్గొన్నారు.