అడవి బిడ్డలకు నిత్య అవసరవస్తువులు పంపిణి

భద్రాచలం: అడవి బిడ్డల ఆకలి ఆర్తనాదాలు. పూట గడవక పస్తులున్న గిరిపుత్రులు. పట్టెడన్నం కోసం కొండకోనల్లో బిత్తర చూపులు. దయార్ద్ర హృదయం స్పందిస్తారని.. ఎండిన డొక్కలకు తిండి గింజలు పెడతారని దేహీ అంటూ విలపించారు. ఆ మాటలు చెవిన పడిన ఆదివాసీ బిడ్డ.. ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క నేను సైతం అంటూ మూటాముల్లెతో అడవి బాట పట్టారు. కొండకోనలు.. వాగులూ వంకలు దాటి వారి ఆకలి తీర్చారు. అమ్మలా ఆదరించావంటూ అడవి బిడ్డలు తెగ సంబరపడి పోయారు. వివరాలు.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గిరిజన గ్రామం భద్రాచలం నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది.


కరోన  వైరస్ వల్ల ఆకలితో అలమటిస్తున్న ఆదివాసులకు  సీతక్క స్వయానా 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వాగులు, వంకలు దాటుకుంటూ నిత్యావసర సరుకులను మోసుకెళ్తు వెళ్లి 20 గిరిజన కుటుంబాలకు సరుకులను అందజేశారు. ములుగు జిల్లాలోని వాజేడు లోని పెనుగోలు గుట్టపై నివసిస్తున్న ఆదివాసులు ఆకలితో అలమటిస్తున్నారని ఆమె దృష్టికి వచ్చింది. నిత్యవసర వస్తువులు లేవని ఎమ్మెల్యే సీతక్క దృష్టికి రావడంతో ఆమె ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా బేగం తో కలిసి ఆదివారం నాడు గుమ్మడిదొడ్డి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి 20 మంది గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులనుఅందజేశారు.