కావలి,(ఆరోగ్యజ్యోతి): పట్టణం పాతవూరు లోని గిరిజన ప్రాంతాల్లో ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ చేవూరు చిన్న ఆధ్వర్యంలో గంట వెంకటేశ్వర బాబు (రిటైర్ టీచర్)వారి సహకారంతో 300 మంది గిరిజనులకు జనురాజుపల్లి జయంత్( టీచర్ ) ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి సోకకుండా అందరూ జాగ్రత్త వహించాలి పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా జీవించాలని, మాస్కులు ధరించాలని ఆయన కోరారు. పై కార్యక్రమములో వైబ్రాంట్స్ ఆఫ్ కలాం టౌన్ ఇంచార్జి చేవూరు కిరణ్ కుమార్, సంస్థ సభ్యులు విక్లిఫ్, యాసిన్, స్టీఫెన్, బక్క ప్రమోద్ కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు.