హైదరాబాద్: కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గాంధీ, నిమ్స్లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లపై నమ్మకం లేకపోతే... ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు... ఐసీఎంఆర్కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆస్పత్రులు, ల్యాబ్లలో వైద్య సిబ్బంది, సదుపాయాలను... ఐసీఎంఆర్ పరిశీలించి నోటిఫై చేయాలని తెలిపింది. ఐసీఎంఆర్ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే... కరోనా చికిత్సకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.