లక్ష మందికి కూడా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం: ఈటల

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): లక్ష మందికి కూడా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈటల రాజేందర్ ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 47 శాతం మంది కోలుకున్నారని, తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్రం అభినందించిందని  ఈ సందర్భంగా ఈటల గుర్తుచేశారు. టెస్ట్‌లు సరిగాచేయడం లేదంటూ ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఆయన తోచిపుచ్చారు. టెస్టులు చేయకపోవడం వల్లే తక్కువ కేసులు అనడం సరికాదన్నారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయొద్దని ఐసీఎంఆర్‌ చెప్పిందని తెలిపారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయకుంటే తెలంగాణ మరో కర్నూలు అయి ఉండేదని చెప్పారు. మర్కజ్‌ కేసులను బయటపెట్టి దేశాన్ని అలర్ట్ చేశామని గుర్తుచేశారు. తెలంగాణలో 90 శాతం కేసులకు మర్కజ్‌ లింకులే కారణమని మరోసారి స్పష్టం చేశారు. కరోనా మరణాలు దాస్తే దాగేటివి కావని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.