కరోనా కారణంగా గత 48 రోజులుగా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక బి ఇ పి సి ఫౌండే షన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు రియాజ్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాల కోసం వారికి ప్రమాదం అని తెలిసి పోరాడుతున్న నిజమైన హీరోలకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇఓ యూసఫ్ ఖాన్ ,సంస్థ సభ్యులు అరుణ్, మాచల్ తదితరులు పాల్గొన్నారు.