కిడ్నీసమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి : నిపుణులు

దేశంలో కోవిడ్‌ 19 సోకిన వారిలో మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొంటున్నవారు అధికంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ (ఐఎస్‌ఎన్‌) తాజా నివేదిక లో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం కోవిడ్‌ 19 బారిన పడిన వారిలో, 25నుంచి 50శాతం మంది కిడ్నీబాధితులున్నారట . కరోనా సోకడం ద్వారా మూత్రంలో ప్రోటీన్ , రక్తం ఎక్కువ గా లీక్ అయినట్లు తెలుస్తుంది. కోవిడ్ 19 విడుదల చేసే హైపోక్సియా లేదా సైటోకిన్‌ మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్‌ శ్వాసకోశ వ్యవస్థలు – ఊపిరితిత్తుల నుంచి పుట్టుకొస్తాయని మన అందరికి తెలుసు. అయితే పెరుగుతున్న కోవిడ్ 19 కేసులతో... రోగులలో ఉండే రోగనిరోధక శక్తి మూత్రపిండాలపై దాడి చేయకుండా కాపాడుతుంది. సార్స్‌, మెర్స్‌-సీఓవీ  ఇన్ఫెక్షన్ల  విషయంలో మునుపటి నివేదికల ప్రకారం అక్యూట్ కిడ్నీఇంజురీ (ఏకే ఐ)  కేసుల్లో 5 నుంచి 15 శాతం ప్రభావం చూపాయి.  అయితే ఈ  కేసులలో 60 నుంచి  90 శాతం మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ 19 రోగుల్లో మొదట కిడ్నీ సమస్యలున్నవారు  3 నుంచి 9 శాతం ఉండగా తరువాతి నివేదికల్లో వారి సంఖ్య మరింతగా పెరిగింది. కరోనా తో బాధపడుతున్న 59 మంది రోగులపై జరిపిన అధ్యయనంలో మూడింట రెండొంతుల మంది రోగులు ఆసుపత్రిలో ఉన్న సమయంలో మూత్రంలో ప్రోటీన్ లీక్‌ను గుర్తించినట్లు తేలిందని  నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్ రాజ్‌శేఖర్ చక్రవర్తి అన్నారు.  తీవ్రమైన లేదా అత్యవసర డయాలసిస్ అవసరమయ్యే చిన్న నిష్పత్తితో సమర్థవంతమైన యాంటీవైరల్ థెరపీ లేకపోవడంతో, నిరంతర కిడ్నీ రీప్లేస్‌మెంట్‌ థెరపీ ఉపయోగిస్తారు. ఈ డయాలసిస్ పద్ధతి అత్యవసరం అనుకునేవారికి రోజులో 24 గంటలు ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా ఎకెఐతో బాధపడుతున్న వారికి రోగనిరోధకశక్తి అవసరమని ఆయన చెబుతున్నారు. సార్స్‌ ,మెర్స్‌ అనారోగ్యాల చికిత్సలో సీఆర్‌ఆర్‌టి విజయవంతంగా ఉపయోగపడింది. అంతేకాకుండా రోగనిరోధక టాక్సిన్‌ను విషాన్ని క్లియర్ చేయడంలోనూ  సహాయపడుతుంది. తద్వారా కోవిడ్ 19 ఉన్న రోగులలో ఎకేఐ లేదా అధిక రోగనిరోధక టాక్సిన్ లోడ్ ఉన్న రోగులలో సీఆర్‌ఆర్‌టి ప్రముఖ పాత్ర పోషిస్తుందని నిమ్స్‌ నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ శ్రీ భూషణ్ రాజు అన్నారు. ఫ్లూయిడ్‌ బ్యాలెన్స్‌ , మెటబాలిక్‌ ఫ్లక్చుయేషన్స్‌ సరిగా తట్టుకోలేని పరిస్థితులలో , ఇతర ఎక్స్‌ట్రాకార్పోరియల్ చికిత్సలు అవసరమయ్యే పరిస్థితులలో, సీఆర్‌ఆర్‌టిను ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌గా ఉపయోగించవచ్చు. ఇటీవల చేసినసర్వే లో  కోవిడ్ 19 రోగులకు ఇన్వాసివ్ మెకానికల్ వెంటిలేషన్ అవసరమని తేలిందని శ్రీ భూషణ్‌ రాజు తెలిపారు. ఇక్కడ సీఆర్‌ఆర్‌టి లేకుండా చికిత్స పొందిన వారి కంటే.. చికిత్స పొందిన వారి మరణాల సంఖ్య తక్కువుగా ఉంది. అయినప్పటికీ, ఎక్స్‌ట్రాకార్పోరియల్ థెరపీ టెక్నిక్‌ల సాధ్యాసాధ్యాలను ఎప్పటిప్పుడు చికిత్స చేసే వైద్యుడు అంచనా వేయాలని ఆయన అన్నారు.