హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : గాంధీ దవాఖాన వైద్యులు కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణికి సురక్షిత ప్రసవంచేశారు. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నుమాకు చెందిన మహిళ (22) ప్రసవం కోసం పేట్లబుర్జు ప్రసూతి దవాఖానను ఆశ్రయించారు. ఆమెలో కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను మూడురోజుల క్రితం గాంధీకి తరలించారు. పాజిటివ్ గర్భిణికి సాధారణ ప్రసవం చేస్తే ప్రమాదం పొంచి ఉండటంతో శుక్రవారం శస్త్రచికిత్స ద్వారా ప్రసవంచేయగా, మగ శిశువు జన్మించాడు.ఇద్దరినీ వేర్వేరు వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిశువుకు శనివారం వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్టు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.