హైదరాబాద్ : కాన్పు కోసం తిరిగి గద్వాల యువతి, పసికందు మృతి చెందిన ఘటనపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయవాది కిషోర్ కుమార్ రాసిన లేఖపై విచారణ చేపట్టిన హైకోర్టు... యువతి కుటుంబానికి పరిహారం చెల్లింపుపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఘటనపై విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కాగా... రెడ్ జోన్లలో కరోనాయేతర వైద్య సేవల కోసం అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.అలాగే... రెడ్ జోన్లలో నోడల్ అధికారులను సిద్ం చేసి విస్తృత ప్రచారాన్ని కల్పించాలని కూడా ఆదేశించింది. ఆస్పత్రుల్లో గర్భిణిలకు వైద్య సేవలందేలా ప్రబుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గర్భిణీలను ఆస్పత్రులకు తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలకు పాస్ లు అడగొద్దిని ఆదేశించింది. ఆస్పత్రుల్లో గర్భిణీలు, క్యాన్సర్, గుండె జబ్బుల రోగులకు చికిత్సలు నిరాకరించడకుండా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19 వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.