వరంగల్,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ నేపధ్యంలో కొనుగోలు కేంద్రాల్లో రద్దీని నివారించడానికి రైతులకు టోకెన్ల జారీ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అందుకే టోకెన్లు వచ్చిన రైతులే తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన సాగునీటి కారణంగా ఈసారి అధిక దిగుబడులు వచ్చాయని అన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని, దాదాపు 30వేల కోట్లు అప్పు తెచ్చి రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్నదని అన్నారు. రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రవాణా, గన్నీబ్యాగులు, గిగడ్డంగుల కొరత వుంది. లారీలు దొరక్కపోతే ట్రాక్టర్లతో ధాన్యం రవాణా చేస్తున్నామని అన్నారు. తాలు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు పండించిన పంటలను ఆఖరు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలుచేస్తుందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.