హైదరాబాద్,: బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు ముంబై నుంచి వచ్చిన 20 మంది లాక్డౌన్తో హైదరాబాద్లో చిక్కుకుపోయారు. చేతిలోని డబ్బులు అయిపోయి.. సహాయం చేసేవారు లేక 40 రోజులుగా అష్టకష్టాలు పడుతున్నారు. తమను ముంబైకి పంపాలంటూ కనిపించినవారందరినీ వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 19న ముషీరాబాద్ పార్సిగుట్టకు చెందిన సత్యనారాయణ, సృజన దంపతుల కుమార్తె పుష్ప వివాహం శ్రీనివా్సతో జరిగింది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు ముంబైకి చెందిన 30 మంది బంధువులు వచ్చారు. వారిలో 10 మంది పెళ్లి జరిగినరోజే తిరిగి వెళ్లిపోగా.. మిగతా వారు హైదరాబాద్ను చూసి వెళ్లాలనే ఉద్దేశంతో మార్చి 23వ తేదీన రిజర్వేషన్ చేయించుకున్నారు. 22వ తేదీ అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లోకి రావడంతో.. వీరి రిజర్వేషన్లు రద్దయ్యాయి.ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ కూడా లేకపోవడంతో.. ముషీరాబాద్ శివాలయం చౌరస్తావద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరిలో 11 మంది వృద్ధులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఆ రోజు నుంచి అష్టకష్టాలు పడుతున్నారు. కనిపించిన నాయకుడిని ‘‘మమ్మల్ని ముంబైకి పంపండి ప్లీజ్’’ అని వేడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ బి.శంకర్లూక్ వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు లాక్డౌన్ పొడిగించిందని వారు వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి, తమను ముంబైకి తరలించాలని కోరుతున్నారు.