జయశంకర్ భూపాలపల్లి(ఆరోగ్యజ్యోతి): ప్రజలు అవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని దీనితో పాటు సామాజిక దూరం పాటించినప్పుడే కరోనా వైరస్ మన దరిచేరదని,జయశంకర్ భూపాలపల్లి జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. శుక్రవారం నాడు కాటారం లో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు అమాలి కార్మికులకు నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇందులో భాగంగా కాటారం గ్రామపంచాయతీ పరిధిలో వస్తువులు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వారు కోరారు.