సిరికొండ,(ఆరోగ్యజ్యోతి): విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎం సుశీల బైక్ అదుపుతప్పి తీవ్రగాయాలయ్యాయి.మండల కేంద్రంలోని వాయి పేట కు వెళ్లే రహదారిపై సోమవారం ఆమె గ్రామ సమీపంలో ఉత్తరప్రదేశ్ వెళ్లి వచ్చిన డ్రైవర్ కు రక్త నమూనాలు తీసుకోవడానికి సిరికొండ మండల ఇన్చార్జి వైద్య అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్ తో కలిసి వెళ్లారు. విధులు ముగించుకొని తిరిగి గ్రామంలో కి బైక్ పై వస్తుండగా రోడ్డు పై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ఆకస్మికంగా బ్రేక్ పడటంతో వెంటనే అదుపు తప్పి పడిపోయారు .