హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి మద్యం అమ్మకాలు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెడ్ జోన్ జిల్లాలో కూడా వైన్ షాపులకు అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. కంటెన్మెంట్ జోన్స్లోని 15 మద్యం షాపులు మూసి ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. బార్లు, క్లబ్బులు, పబ్బులకు అనుమతి లేదని చెప్పారు. మద్యం ధరలు 16 శాతం పెంచుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. చీప్ లిక్కర్పై 11 శాతం రేటు పెంచుతున్నట్లు చెప్పారు. మళ్లీ తగ్గించే అవకాశం కూడా లేదన్నారు. ఉదయం 10 గంటల నుంచి వైన్స్ షాపులు ఓపెన్ అవుతాయని కేసీఆర్ తెలిపారు. వైన్స్ షాపుల వద్ద బౌతిక దూరం పాటించాల్సిదేనని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే వైన్ షాపులను సీజ్ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సర్వీసులు ఇప్పుడు స్టార్ట్ కావని చెప్పారు. 15వ తేదీ తర్వాత ప్రైవేటు బస్సులు నడిచే అవకాశం ఉందన్నారు. గ్రీన్జోన్లో ఆటోలు, క్యాబ్లకు అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు.