హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను తెలంగాణ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని కింగ్కోఠి ఆస్పత్రి దగ్గర కరోనా కలకలం సృష్టించింది. కరోనా లక్షణాలతో ఫుట్పాత్పై వ్యక్తి మృతి చెందాడు. కోవిడ్-19 బాధితుడి జేబులో కింగ్కోఠి ఆస్పత్రి నుంచి చెస్ట్ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేసిన చీటీని గుర్తించారు.