హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఆదివారం పది గంటలకు- పది నిమిషాలు పేరిట ప్రత్యేక సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఆదివారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఇళ్లలో ఈ కార్యక్రమంలో పాల్గొని నీరు నిల్వలేకుండా, చెత్తను ఏరి ఇంటి పరిసరాలు శుభ్రం చేశారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.