న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచవ్యవస్థకున్న పరిమితులను కరోనా వైరస్ బట్టబయలు చేసిందని ప్రధాని మోదీ చెప్పారు. నిజాయితీ, సమానత్వం, మానవత ఆధారంగా ఒక కొత్త ప్రపంచీకరణను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం అలీనోద్యమ (నామ్) సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. ‘కరోనాపై ప్రపంచమంతా పోరాడుతున్నా.. ప్రాణాంతక వైరస్ మాదిరిగా సామాజిక వర్గాలను-దేశాలను విభజించేందుకు కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని, నకిలీ వార్తలను వ్యాపింపజేస్తున్నాయి’ అంటూ పాకిస్థాన్పై పరోక్షంగా ధ్వజమెత్తారు.