వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి


 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్  ప్రభావంవల్ల రెండు నెలలుగా టీకాలు తగ్గాయని వాటిని వెంటనే ముమ్మరం చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సీఈవో లతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం తో పాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకు వెళ్ళి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఏ ఒక్క శిశువును కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి వ్యాధినిరోధకటీకాలు అందించాలని తెలిపారు వ్యాధి నిరోధక టీకాల తో పాటు సంబంధిత రికార్డులను కూడా పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల సీఈవో లు రాజారెడ్డి, నవీన్, విష్ణు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.