కంటికి కనిపించని వైరస్తో యుద్ధం చేస్తున్న పోరాట యోధులకు కృతజ్ఞతలు తెలుపుతూ నేడు త్రివిధ దళాలు వందన సమర్పణ చేసిన విషయం తెలిసిందే. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా జెట్స్, రవాణా విమానాలు, హెలికాఫ్టర్లు దేశవ్యాప్తంగా వందన సమర్పణ చేశాయి. కరోనా రోగులకు సేవలందిస్తున్న కోవిడ్ ఆస్పత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఈ సన్నివేశం ప్రతి ఒక్కరు రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. తాజాగా దీనిపై చిరంజీవి కూడా స్పందించారు. సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశం మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న అత్యవసర సేవా సిబ్బందికి పుష్పాభివందనం చేయటం అభినందనీయం. మీ ఇద్దరికి మేము రుణపడి ఉన్నాం అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు