హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం బయటపడింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తికి గుట్టుచప్పుడు కాకుండా ఆర్ఎంపీ చికిత్స చేశాడు. కరోనా అనుమానితుడి నుంచి వైద్యుడు పలు మార్లు బ్లడ్ శాంపిల్స్ సేకరించినట్లు సమాచారం. స్థానికంగా డయాగ్నోస్టిక్స్లోనూ బాధితుడు వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. అనుమానంతో చెస్ట్ ఆస్పత్రిలో సోమవారం బాధితుడు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. బాధితుడకి పాజిటివ్ రావడంతో ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా బాధితుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలించారు. ఆర్ఎంపీ డాక్టర్ పలువురికి ట్రీట్మెంట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్ఎంపీ డాక్టర్ పరారీలో ఉన్నాడు.