ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణి లేనట్టే...!!

ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున హైదరాబాద్ లో బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణి చేస్తుంటారు.  ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ వస్తూనే ఉన్నది.  అయితే, ఈ ఏడాది ఈ చేప ప్రసాదం పంపిణీపై మొన్నటి వరకు నీలిమేఘాలు కమ్ముకున్నాయి.  చేప ప్రసాదం చేస్తారా చేయరా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.  


అనుకున్నట్టుగానే ఈ ఏడాది చేప ప్రసాదం చేయడం లేదని బత్తిన సోదరులు ప్రకటించారు.  ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా చేప ప్రసాదం పంపిణి చేయడం లేదని ప్రకటించారు.  కరోనా మహమ్మారి గత కొంతకాలంగా రోజు రోజుకు విస్తరిస్తోంది.  దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం తప్పించి దీనికి మందు లేకపోవడంతో ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణి చేయడం లేదని బత్తిన సోదరులు ప్రకటించారు.  ఎవరూ కూడా హైదరాబాద్ రావొద్దని వారు తెలిపారు.