ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున హైదరాబాద్ లో బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణి చేస్తుంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ వస్తూనే ఉన్నది. అయితే, ఈ ఏడాది ఈ చేప ప్రసాదం పంపిణీపై మొన్నటి వరకు నీలిమేఘాలు కమ్ముకున్నాయి. చేప ప్రసాదం చేస్తారా చేయరా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.
అనుకున్నట్టుగానే ఈ ఏడాది చేప ప్రసాదం చేయడం లేదని బత్తిన సోదరులు ప్రకటించారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా చేప ప్రసాదం పంపిణి చేయడం లేదని ప్రకటించారు. కరోనా మహమ్మారి గత కొంతకాలంగా రోజు రోజుకు విస్తరిస్తోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం తప్పించి దీనికి మందు లేకపోవడంతో ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణి చేయడం లేదని బత్తిన సోదరులు ప్రకటించారు. ఎవరూ కూడా హైదరాబాద్ రావొద్దని వారు తెలిపారు.