న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలను, విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేకంగా శ్రామిక ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ట్రైన్ కేవలం వలస కూలీలు, విద్యార్థులకు మాత్రమే అని స్పష్టం చేశారు. ఇదే విషయమై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఎవరు కూడా ఇష్టానుసారంగా బయటకు రావొద్దన్నారు. అధికారులే తమ తమ దగ్గరకు వచ్చి గమ్యస్థానాలకు చేరుస్తారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాంచీ మొదటి ట్రైన్ బయలు దేరిందని కిషన్ రెడ్డి తెలిపారు.