బీజింగ్: కరోనా చికిత్సకు ఉపకరించే మరో విధానంపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పెకింగ్ యూనివర్సిటీ-బీజింగ్ అడ్వాన్డ్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ జెనోమిక్స్ శాస్త్రవేత్తలు సింగిల్ సెల్ జీనోమ్ సీక్వెన్సింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు. దీంతో కరోనా ను ఎదుర్కొనే బీ సెల్స్లోని శక్తిమంతమైన మోనోక్లోనల్ ప్రతిరోధకాల(ఎంఏబీఎస్)ను వేగంగా గుర్తించవచ్చన్నారు.